జోధ్పూర్ ఉమైద్ భవన్ మందిరానికి దాని స్థాపకుడు ఉమైద్ సింగ్ మహారాజు పేరుపెట్టారు. ఈ అందమైన భవనం చిత్తర్ కొండపై ఉండటంవల్ల దీనిని ‘చిత్తర్ పాలెస్’ అని కూడా అంటారు. ఇది ఇండో-వలస రాజ్య, చిత్రకళా నిర్మాణ శైలికి ఒక సరైన ఉదాహరణ.
ఆర్ట్ డేకో చిత్రకళా విధానాన్ని ప్రస్ఫుటంగా ప్రదర్శించే నిర్మాణ శైలి కల ఈ భవనం 1920, 1930లకు చెందినది. ఒకదానితో ఒకటి బిగించుకుని ఉండేలా చెక్కిన ఇసుకరాతి ముక్కలతో ఈ భవంతి ని నిర్మించారు. ఈ భవనం నిర్మాణంలో సున్నం ఉపయోగించలేదు. ఈ ప్రత్యెకత వల్ల ఈ ప్రదేశాన్ని చూడడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తారు.
హెన్రీ వాన్ అనే ఆంగ్ల వ్యక్తీ ఈ భవన నిర్మాణ రూపశిల్పి. ఈ భవనంలోని ఒక భాగాన్ని హెరిటేజ్ హోటల్ గా మార్చివేయగా మరో భాగం మ్యూజియంగా వుంచేసారు.