బురిగోసైన్ దేవాలయం జోర్హాట్ లోని ప్రసిద్ధ దేవాలయం. ఇది నగరం మధ్యలో వుండి, ఈ ప్రాంతంలోని ప్రజలు, యాత్రికులు అందరిచేతా బాగా పూజింప బడుతుంది. ఇక్కడి ప్రధాన దైవం బురిగోసైన్. ఈ గుడి పూజారి విగ్రహం కూడా గుడిలో వుంటుంది.
ఈ రెండు విగ్రహాలను జయంతియా నుంచి తెచ్చారని, ముందుగా రంగపూర్ లో స్థాపించి తరువాత ఇక్కడికి తెచ్చారని భావిస్తారు. అహోం రాజులు రంగపూర్ నుంచి జోర్హాట్ కు తమ రాజధానిని మార్చినప్పుడు ఈ విగ్రహాలను కూడా మార్చారు. తాంత్రిక పూజలు చేసే శాక్త తెగకు చెందిన దేవాలయం ఈ బురిగోసైన్ దేవాలయం.
బురిగోసైన్ దేవాలయం నగరం మధ్యలో వుండడం వల్ల దీన్ని కనుక్కోవడం తేలికే. పైగా, ఇది జోర్హాట్ రైల్వే స్టేషన్ కు సమీపంలోనే వుంది. యాత్రికులు నగరంలోని ఇతర భాగాలలో బస చేస్తున్నట్లయితే, ఇక్కడికి కాబ్ లోనో ఆటో లోనో తేలిగ్గా చేరుకోవచ్చు.