అహోం సేనానుల్లో గొప్పవాడిగా భావించే లచిత్ బోర్ఫుకాన్ స్మారకార్ధం లచిత్ బోర్ఫుకాన్ మైదాం నిర్మించారు. ఈఈ 16 వ శతాబ్దపు యోధుడి గౌరవార్ధం లచిత్ బోర్ఫుకాన్ మైదాం నిర్మించారు, ఎందుకంటే బలవంతులైన ముఘలాయిలను ఓడించిన ఏకైక అహోం యోధుడు ఇతనే.
1672 లో లో సరాయిఘాట్ వద్ద ముఘలాయిలతో వీరోచితంగా పోరాడి లచిత్ బోర్ఫుకాన్ గెలిచాడు. ఆ యుద్ధం జరిగిన ఏడాదికి ఆయన మరణించాడు, అతని స్మృత్యర్ధం ఈ మైదాం నిర్మించారు. స్వర్గదేవ్ ఉదయాదిత్య సింగ్ నిర్మించిన ఈ మైదాం లో లచిత్ బోర్ఫుకాన్ భౌతిక కాయాన్ని ఉంచారు.
ఈ మైదాం సరిగ్గా మేలేంగ్ హులున్గాపార్ లోని గోహైన్ గావ్ లో, గిబ్బన్ వన్యప్రాణి అభయారణ్యం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వుంది. లచిత్ బోర్ఫుకాన్ కు వెళ్తే అహోం రాజుల నాటి గత వైభవాన్ని సందర్శించినట్టు వుంటుంది. వర్నరంజిటంగా అలంకరించిన ఈ మైదాం ఇప్పటికీ అహోం రాజుల రోజులు గుర్తుకు తెస్తుంది.