నిమతి జోర్హాట్ లోని ప్రధానమైన రేవు. నిమతి ఘాట్ మజులికి ప్రవేశ ద్వారంగా కూడా పని చేస్తుంది, ఇది ప్రపంచంలోని పెద్ద నదీ ద్వీపాల్లో ఒకటి. ఈ నదీ తీరం జోర్హాట్ కు ప్రధానమైనదే కాక ఎగువ అస్సాం లోని నగరాలు, పట్టణాలకు కూడా ముఖ్యమైనదే.
నిమతి ఘాట్ నుంచి మజులికి వెళ్ళే ఓడ ద్వారా చేరుకోవడం మాత్రమె ఏకైక మార్గం. ఈ ఘాట్ కమలాబారి, మజూలి ద్వీపంలోని ఔనియతి లాంటి పర్యాటక కేంద్రాలకు ప్రవేశ ద్వారంగా పనిచేస్తుంది. నిమతి జోర్హాట్ నగర కేంద్రం నంచి కేవలం 17 కిలోమీటర్ల దూరంలో వుంది.
పొడిగా వుండే కాలాల్లో నిమతి ఘాట్ చాలా రద్దీగా వుంటుంది – ప్రధానంగా వేసవి, శీతాకాలాల్లో; వర్షాకాలంలో ఘాట్ మార్గాలు చాలా ప్రమాదకరంగా వుంటాయి. ఉద్ధృతంగా ప్రవహించే బ్రహ్మపుత్ర నది ఈ ఘాట్ వద్ద ప్రమాదకరంగా ప్రవహిస్తుంది – దీంతో మజూలి లేదా ఇతర ప్రదేశాలకు పడవలలో చేరుకోవడం కష్టమౌతుంది. జోర్హాట్ నగర కేంద్రం నుంచి నిమతి ఘాట్ కు నిత్యం బస్సులు నడుస్తున్నాయి.