17 వ శతాబ్దం లో నిర్మించబడిన ఈ మసీదు - ఎ- అజాం అనబడే అద్భుతమైన మసీదు కడప లో ఉంది. గండికోట కి అతి సమీపం లో ఈ మాస్క్ ఉంది. మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ పాలనలో ఉన్న కాలంలో కడప లో ఈ మాస్క్ నిర్మింపబడినదని చరిత్రకారుల నమ్మకం. అందువల్ల, ఎన్నో పెర్షియన్ శిలా శాసనాలు ఈ మాస్క్ గోడలపై కనబడతాయి.
కడపలో అత్యంత ప్రసిద్ది చెందిన ఈ మసీదుకి ఏంతో మంది ముస్లిం భక్తులు విచ్చేసి నమాజ్ లేదా ప్రార్ధనలు చేస్తారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యతే కాకుండా, అందమైన నిర్మాణ శైలితో కూడా ఈ మసీదు ఎందరినో ఆకట్టుకుంటోంది. మొఘల్ కాలం యొక్క నిర్మాణ శైలి ఈ మసీదు నిర్మాణంలో గమనించవచ్చు. పెర్షియన్ నిర్మాణాల ఆరాధకుడైన ఔరంగజేబ్ వల్ల పెర్షియన్ శైలి యొక్క నిర్మాణ శైలి తో ఇక్కడి నిర్మాణం ప్రభావితమయింది. ఔరంగజేబ్ కాలం లో ఉత్తర భారత దేశం లో నిర్మింప బడిన ఇతర మసీదుల తో ఈ మాస్క్ కి పోలికలు ఉన్నాయి.