భబువ దగ్గరగా ఉన్న కైమూర్ వన్యప్రాణి అభయారణ్యం 1342 కిలోమీటర్లలో విస్తరించిన రాష్ట్రంలోని అతి పెద్ద అభయారణ్యమే కాక కొన్ని జలపాతాలు, సరస్సులు కూడా దీనిలో ఉన్నాయి. పర్యాటకులు పులులు, చిరుతలు, అడవి పందులు, సాంబార్ జింక, చితాల్, నాలుగు కొమ్ముల జింక, నిల్గై వంటి జంతువులతో బాటు డెబ్భై జాతుల పక్షులకు నివాస స్థలంగా ఉన్న ప్రాంతాన్ని ఇక్కడ చూడవచ్చు.
శీతాకాలంలో వలస పక్షుల రాక వలన ఎక్కువ పక్షి జాతులను గమనించవచ్చు. అనుపమ సరస్సు, కాలిదాలలో చేపలను చూడవచ్చు. వన్యప్రాణి అభయారణ్యంలో కనబడే జంతువులలో పులులు, ఎలుగుబంట్లు, సాంబార్ జింక, చితాళ్ళు, నాలుగు కొమ్ముల జింక, నిల్గై లు ఉన్నాయి. వలసల కాలంలో పక్షుల సంఖ్య పెరుగుతుంది. మధ్య ఆసియా ప్రాంతం నుండి పక్షులు అధిక సంఖ్యలో వస్తాయి. ఈ అభయారణ్యానికి భబువ నుండి రోడ్డుమార్గానే కాక, మోహనియా లోని రైలు స్టేషన్ ద్వారా కూడా చేరవచ్చు.