శ్రీకాళహస్తి లోని ప్రసన్న వరదరాజ స్వామి దేవాలయం దక్షిణ భారతం లోని ప్రధాన దేవాలయాల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఇది శ్రీకాళహస్తి దేవాలయానికి దగ్గరలోనే వుంది. నిజానికి, ప్రసన్న వరదరాజ స్వామి దేవాలయం శ్రీ కాళహాస్తీశ్వర దేవాలయం లో భాగంగా పరిగణిస్తారు. ఈ దైవం ఆశీస్సుల కోసం ప్రతి ఏటా వేలాది మంది భక్తులు వస్తారు.
ఇక్కడ పునరుద్ధరణ పనులు జరుగుతుండడం వల్ల ఈ దేవాలయం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఈ పనులు జరుగుతుండగా గుడి లోని ఒక గదికి పెద్ద చెక్క ద్వారం వుండడం అధికారులు గమనించారు. ఇది తెరిచినప్పుడు చాలా విలువైన ప్రాచీన వస్తువులు కనపడ్డాయి. లోపల నిధి దొరికిందన్న వార్త దావానలంలా వ్యాపించింది. భక్తులు, ప్రజలు ఈ నిధిని చూడ్డానికి దేవాలయం వద్దకు చేరుకున్నారు. ఐతే వారిని లోపలి రానీయలేదంటారు.