ఉత్తరాకండ్ లోని డెహ్రాడున్ జిల్లా లో సముద్ర మట్టానికి 780 మీ ఎత్తు లో ఉన్న ఒక అందమైన పర్యాటక ప్రదేశం కల్సి. యమునా నది మరియు తొన్స్ నది కలిసే చోట ఉన్నటువంటి జున్సర్ - బావర్ ట్రైబల్ రీజియన్ కి ముఖ ద్వారం గా పనిచేస్తుంది . పురాతన శిధిలాలకు , సాహాస క్రీడలకు మరియు పిక్నిక్ లకు ప్రఖ్యాతి పొందిన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. చారిత్రిక ప్రాముఖ్యత గల అశోకుని రాతి శాసనం ఇక్కడి ముఖ్య ఆకర్షనలలో ఒకటి . 253 క్రీ.పూ లో మౌర్య రాజు అయిన అశోకుని 14 వ శాసనం. ప్రాకృత బాష లో పాళీ లిపి లో ఉన్న ఈ శాసనం రాజు యొక్క సంస్కరణలు మరియు సలాహాలను సూచిస్తుంది . 10 అడుగుల ఎత్తు , 8 అడుగుల వెడల్పులో ఈ శాసనం ఉంటుంది .
వివిధ రకాల అంతరించి పోతున్న పక్షుల ఆవాసమైన అసం బారాజ్ ను కుడా పర్యాటకులు సందర్సించవచ్చు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ అఫ్ నేచర్ - రెడ్ డేటా బుక్ లో ఈ పక్షులను అరుదైన జాతివని తెలియచేయ బడింది . ఇక్కడ మల్లర్డ్స్, రెడ్ క్రేస్తేడ్ పోచార్డ్స్, రుద్ది షెల్ డక్స్ , కూట్స్ , కార్మోరాంట్స్ , ఎగ్రేత్స్ , వాగ్ టైల్స్ , పాండ్ హెరాన్స్ , పల్లాస్ , ఫిషింగ్ ఈగల్స్ , మార్ష్ హర్రిఎర్స్ , గ్రేటర్ స్పాట్ఎడ్ ఈగల్స్ , ఒస్ప్రెయ్స్ మరియు స్టెప్పీ ఈగల్స్ వంటి పక్షుల ను చూసి పర్యాటకులు పరవసిస్తారు. అంతేకాక పర్యాటకులు 11 జాతుల వలస పక్షుల తో కలిపి ఇక్కడ 90 శాతం నీటి పక్షులను అక్టోబర్ నుండి నవంబర్ మధ్య, ఫెబ్రవరి నుండి మార్చ్ వరకు చూడవచ్చు .
కల్సి లో ని వికాస్ నగర్ షాపింగ్ కు అనువైనది . మరోవైపు డాక్ పథార్ పిక్నిక్ లకు అనువు గా ఉంది కనోఇంగ్ , బోటింగ్ , వాటర్ స్కీఇంగ్ , సెయిలింగ్ మరియు హోవర్ క్రాఫ్ట్ వంటి ఆకర్షనలను కలిగి ఉన్నది . యమునా నది లోని అకలుషిత జలాలలో పర్యాటకులు రాఫ్టింగ్ ని ఆనందించ వచ్చు . ఇక్కడి ప్రైవేటు రిసార్ట్ లు మహ్సీర్ ఫిషింగ్ ను సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు , మార్చ్ నుండి ఏప్రిల్ వరకు ఏర్పాటు చెస్తారు.
తిమ్లి పాస్ , కట్ట పతర్ మరియు చక్రత కుడా ఇక్కడి చూడతగ్గ ప్రదేశాలు.73 కి. మీ దూరం లోని డెహ్రాడున్ యొక్క జాలి గ్రాంట్ ఎయిర్పోర్ట్ కల్సి కి దగ్గరలోని విమానాశ్రయం . డెహ్రాడున్ నుండి రైలు ద్వారా కుడా ఇక్కడికి చెరుకొవచ్చు. ఢిల్లీ వంటి దగ్గరి నగరాల నుండి బస్సులు కల్సి చేరుకోటానికి అందుబాటులో ఉంటాయి . ఎండా కాలం ఈ ప్రదేశాన్ని చూడటానికి అనువైనది.