కాంచేన్ జంగా జాతీయ పార్కును 1977 లో స్థాపించారు. ఇది సిక్కిం లోని ఉత్తర జిల్లాలో 850 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పరుచుకున్న సిక్కిం లోని అతి పెద్ద జాతీయ పార్కు. ఉత్తరాన టెంట్ శిఖరం, తూర్పున లామో ఆంగ్డేన్ పర్వతం, దక్షిణాన నార్సింగ్, పందిమ్ పర్వతాలు, పడమట కాంచేన్ జంగా పర్వతాలు సరిహద్దుగా కలిగి వుంది.
ఈ పార్కు ఇప్పటికీ పర్యావరణ పరంగా మార్పులు జరగలేదు కనుక జంతువులకు సురక్షితమే. మంచు చిరుత, హిమాలయన్ నల్లటి ఎలుగుబంటి, ఎర్రటి పాండా, మొరిగే జింక లాంటివి ఇక్కడ కనపడే జంతు జాతులు. ఈ పార్క్ లోని కొన్ని ప్రదేశాల్లోకి ఇంకా మానవ సంచారం లేదు కనుక ఈ పార్క్ ప్రాంతం లో మరిన్ని కొత్త జాతులు కూడా కనుగొనే అవకాశం వుంది.
సింధూర చెట్టు, దేవదారు, కొండ రావి చెట్టు, మాపుల్, విల్లో చెట్లు ఇక్కడి వృక్ష సంపదలో భాగం. ఎత్తైన భాగాలలో పర్వత ప్రాంతాల్లో ఔషధ మొక్కలతో పాటు గడ్డి మొక్కలు, పొదలు కూడా వున్నాయి. ఎర్రటి ఫీసంట్, సత్యే ట్రాగోపాన్, ఆస్ప్రీ, హిమాలయన్ గ్రిఫ్ఫన్, లామ్మేరిగర్, ట్రాగోపాన్ లాంటి పక్షి జాతులకు కూడా ఈ పార్కు ప్రసిద్ది చెందింది.