తూర్పు హిమాలయ పర్వత శ్రేణులలో సిక్కిం, టిబెట్ సరిహద్దుల్లో ఉండే ఎత్తైన పర్వత౦ పౌహున్రీ. ఈ శిఖరం కాంచేన్ జంగా నుంచి 75 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి7128 అడుగుల ఎత్తున వుంది.
ఈ పర్వతం గురించిన ఆసక్తి కరమైన విషయం ఒకటుంది. దీన్ని 1911 లో ఇద్దరు షేర్పా జాతి వారితో కలిసి మొదటి సారిగా స్కాటిష్ పర్వతారోహకుడు అలేగ్జాందర్ మిచెల్ కేల్లాస్ అధిరోహించాడు. అయితే అక్కడి నుంచి 80 ఏళ్ళ తరువాత, 1911-1930 ల మధ్య భూమి మీద చేయబడిన అతిపెద్ద పర్వతారోహణ ఇదేనని తేలింది.