హిమాచల్ ప్రదేశ్ లో ని కాంగ్రా జిల్లా లో ఉన్న పతంకోట్ నుండి 65 కిలోమీటర్ల దూరం లో బీస్ నది ఒడ్డున ఉన్నది ఈ సాంచురీ. సాంబార్, నిల్గై, బార్కింగ్ డీర్, వైల్డ్ బొర్ మరియు లెపర్డ్ వంటి అనేక రకాల జంతువులని ఇక్కడ చూడవచ్చు. 220 రకాల వలస పక్షి జాతులు, 54 కుటుంబాలకు చెందినవి ఇక్కడ నివాసం ఉంటున్నాయి. ఈ చెరువు కనీసం 27 రకాల చేపలకు నెలవు.చుట్టూ పక్కల దట్టమైన పైన్ చెట్లతో ఉండే ఈ చెరువు ఇక్కడ నిర్వహించే అనేక ఆటల ద్వారా విశేష సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తున్నది.