గడియ పర్వతాలు కంకేర్ లో ఎత్తైన పర్వతాలుగా ఉన్నాయి. ఇది ఒక సహజ కోట మరియు ఒకప్పుడు కంద్ర రాజవంశం యొక్క రాజు ధర్మ దేవ్ రాజధానిగా ప్రకటించారు. కొండ పైన ఎప్పుడు పొడిబారని ఒక వాటర్ ట్యాంక్ ఉంది. దూద్ నది పర్వతాల క్రిందికి ప్రవహిస్తుంది.
ఈ ట్యాంక్ కు సంబంధించి ఒక పురాణ కధ ఉంది. ట్యాంక్ యొక్క రెండు భాగాలు రాజు యొక్క ఇద్దరు కుమార్తెలు అయిన సోని మరియు రూపై అనే పేర్లతో పిలవబడుతున్నాయి. ఇద్దరు కుమార్తెలు సరస్సు లో పడిపోయారని చెబుతారు. అందువలన వాటికీ సోని మరియు రూపై అని పేర్లు పెట్టారు. ఈ లోతైన నీటి కింద ఒక బంగారు మరియు వెండి చేపలుగా బతికే ఉన్నారని చెప్పుతారు.
ఈ చెరువుకు దక్షిణ భాగంలో చురి పాగర్ అనే గుహ ఉన్నది. ఈ గుహ 500 మంది ప్రజలకు వసతి కల్పిస్తుంది. అంతేకాక బయటి దాడుల నుండి రక్షణ కొరకు ఉపయోగించేవారు. పర్వతం యొక్క దక్షిణ తూర్పు భాగంలో జోగీ గుహలు ఉన్నాయి. ఈ ఇరుకైన గుహ ధ్యానం కోసం సన్యాసులకు ఒక ఆశ్రయం వలె పనిచేసింది. ఈ పర్వతంపై శీతల ఆలయం కూడా ఉంది.
గడియ పర్వతం మీద జరిగే మహాశివరాత్రి పండుగ సమయంలో వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తారు.