గొప్ప చారిత్రక ప్రాధాన్యత కలిగిన హోలీ ట్రినిటీ కేథడ్రాల్, కేరళ లో ని పురాతనమైన కాథలిక్ చర్చ్ ల లో ఒకటి గా పేరొందింది. ఉత్తర మలబార్ లో మిషనరీ కార్యకలాపాలని నిర్వహించేందుకు ఈ కేథడ్రాల్ ని ఉపయోగించేవారు. క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేసే క్రమంలో నాలుగు ఫ్రాన్సిస్కాన్ మిషనరీస్ ఈ రోమన్ కాథలిక్ చర్చ్ ని 16 వ శతాబ్దంలో సందర్శించారని చరిత్ర చెబుతోంది. అప్పటి పరిపాలకుల అనుమతితో ఈ మిషనరీస్ 1501 లో ఒక చాపెల్ ని కట్టారు. ప్రస్తుత హోలీ ట్రినిటీ కేథడ్రాల్ ఈ ప్రదేశం లో నే ఉన్నదని నమ్మకం.
కన్నూర్ నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్నస్సేరి లో ఉన్న ఈ హోలీ ట్రినిటీ కేథడ్రాల్ కి సులభంగా రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. బర్నస్సేరి చుట్టు పక్కల ప్రాంతాలని కన్నూర్ కంటోన్మెంట్ గా పూర్వం పిలిచేవారు. సెయింట్ థామస్ ఆర్థోడాక్స్ చర్చ్ మరియు ఫోర్ట్ సెయింట్ ఏంజెలో వంటివి ఇక్కడున్న మరిన్ని పర్యాటక ఆకర్షణలు. రోమన్ - గోతిక్ నిర్మాణ శైలితో ఈ చర్చ్ అమితంగా ఆకర్షిస్తుంది. 2010 లో ఈ చర్చ్ ని పునరుద్ధరించారు.