అందంగా విస్తరించబడిన తెల్లని ఇసుక తీరంతో ఉన్న పయ్యమ్బలం బీచ్ కన్నూర్ లో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణ. కన్నూర్ నగరం నుండి రెండు కిలో మీటర్ల దూరం లో ఉన్న ఈ బీచ్ కి రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఈ బీచ్ లో కుర్చుని బంగారు కిరణాల ప్రసరించే సూర్యాస్తమయాన్ని చూసి రోజు వారి దైనందిన జీవితం నుండి కొంచెం విరామం పొందడానికి పర్యాటకులు ఈ బీచ్ కి తరలి వస్తారు.
తల్లి బిడ్డల అద్భుతమైన శిల్పం ఈ బీచ్ లో ఉన్న మరొక ప్రధాన ఆకర్షణ. మలంపుజ్హ లో యక్షి శిల్పాన్ని చెక్కిన ప్రసిద్ది చెందిన శిల్పి కనయి కున్జిరామన్ చేత చెక్కబడిన ఈ భారీ శిల్పం పర్యాటకులని అతని పనితనం తో పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తుంది.
ఈ బీచ్ కి దగ్గరలో ఉన్న గార్డెన్ లో సాయంత్రం పుట పర్యాటకులు సేద దీరి సముద్రపు అందాలు గమనించవచ్చు. స్వదేశాభిమాని రామకృష్ణ పిల్లా, పంబన్ మండవన్, ఎ.కె. గోపాలన్ మరియు కే.జి, మరార్ వారి చివరి విశ్రాంతిని ఈ బీచ్ లో నే తీసుకున్నారు. పరిశుభ్రత మరియు సురక్షితమైన ప్రదేశం కావడం వల్ల కుటుంబ సమేతంగా గడపడానికి ఈ బీచ్ అనువైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు.