కన్నూర్ పట్టణం నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సుందరేశ్వర టెంపుల్ ప్రసిద్దమయిన పుణ్య క్షేత్రం. 1916 లో కేరళ యొక్క ఆధ్యాత్మిక నేత సంఘ సంస్కర్త అయిన శ్రీ నారాయణ గురు చే ఈ ఆలయం నిర్మించబడింది. శ్రీ నారాయణ గురు గారిచే నాలుగు ఆలయాలు నిర్మించబడ్డాయని వాటిలో ఈ సుందరేశ్వర ఆలయం ముఖ్యమైనదని చరిత్ర చెబుతోంది.
ఈ ఆలయంలో మహాశివుడు, సుందరేశ్వర స్వామి రూపంలో కొలువై ఉంటాడు. సౌందర్యానికి దేవునిగా కూడా సుందరేశ్వర స్వామి ప్రసిద్ది. దక్షిణ భారత దేశంలో ఉన్న ఆలయాలకు భిన్నంగా కులమతాలకు అతీతంగా ఈ ఆలయాన్ని ఎవరైనా సందర్శించవచ్చు.
ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే నెలల మధ్య ఈ ఆలయంలో ప్రధాన పండుగని నిర్వహిస్తారు. ఈ పండుగ జరిగే ఎనిమిది రోజులలో ఉత్సవాలు వేడుకలలో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, బాణసంచా ఉత్సవాలు, ఊరేగింపులు వంటివి ఇక్కడ జరుగుతాయి . సంవత్సరం మొత్తం ఈ ఆలయాన్ని పర్యాటకులు సందర్శించే అవకాసం కలదు. ఈ పండుగలలో, వేడుకలలో పాల్గోనాలనుకుంటే మాత్రం ఎండాకాలంలో ఈ ఆలయాన్ని సందర్శించాలి.