గ్రీన్ పార్క్ ను గ్రీన్ పార్క్ స్టేడియం అని కూడా అంటారు. ఇది కాన్పూర్ లోని సివిల్ లైన్స్ సమీపం లో గంగ నది ఒడ్డున కలదు. ఈ పార్క్ కు మేడం గ్రీన్ అనే ఇంగ్లీష్ లేడీ పేరు పెట్టారు. స్వాతంత్ర పూర్వపు రోజుల్లో ఈమె ఇక్కడ హార్స్ రైడింగ్ ప్రాక్టీసు చేసింది.
ఈ పార్క్ లో ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ క్రికెట్ టీం క్రికెట్ మ్యాచ్ ప్రాక్టీసు చేస్తోంది. ఈ పార్క్ లో ఫ్లడ్ లైటింగ్ సౌకర్యం, మరియు 60,000 మంది ప్రేక్షకులు కూర్చునే స్థలం కలవు. దీనిలో స్టూడెంట్స్ గాలరీ కూడా కలదు. వీడియో స్క్రీన్ లు, స్కోర్ బోర్డు వంటివి కూడా కలవు. ఇక్కడే మొట్ట మొదటగా 1959 లో ఇండియన్ ఆటగాళ్లు ఆస్ట్రేలియా క్రికెట్ టీం ను ఓడించారు. ఈ పార్క్ లో ప్రసిద్ధ క్రికెట్ క్రీడాకారులు సుభాష్ గుప్తే, జసుభాయి పటేల్, మల్కాలం మార్షల్, సునీల్ గవాస్కర్, గుండప్ప విశ్వనాథ, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, మొహమ్మద్ అజరుద్దీన్ వంటి వారు ఆడారు.