వట్ట కొట్టాయి ఫోర్ట్ కన్యాకుమారి సిటీ కి ఈశాన్యంగా సుమారు 6 కి. మీ. ల దూరం లో కలదు. ఈ కోట ను 18 వ శతాబ్దం లో నిర్మించారు. ట్రావెన్ కూర్ రాజులు నిర్మించిన కోటలలో ఇది చివరిది.
కోట గోడలు సుమారు 25 అడుగుల ఎత్తు కలిగి వాటి మన్దమ్ ముందు భాగం లో సుమారు 29 అడుగుల వరకూ వుంటుంది. ఈ కోట ను డచ్ నేవల్ ఆఫీసర్ దే లన్నోయ్ నిర్మించారు. ఇది ఒక రాతి కోట. దీనిలో రెస్ట్ రూములు, వాచ్ టవర్లు, ఆయుధ గదులు కలవు. కోట గోడలు లోపలి భాగం లో పాండ్య రాజుల చిహ్నాలు కొన్ని కలిగి వుంటాయి. కనుక ఈ కోట పాండ్య రాజుల అధీనంలో గతం లో ఉండేదని చెపుతారు.
ఈ కోట శిఖరం నుండి గతం లో పద్మనాభపురం పాలస్ కనపడేది. కోట నుండి పాలస్ కు గతం లో ఒక సొరంగమార్గం వుండేది. ఇపుడు దానిని మూసి వేసారు. ఇక్కడ నుండి పర్యాటకులు సముద్ర అందాలు చూడవచ్చు. కోటకు ఒకవైపు నుండి బంగాళా ఖాతం మరియు మరొక వైపు నుండి అరేబియన్ సముద్రం చూడవచ్చు.