షాహి సమాధాన్ (రాజ స్తూపం) షాలిమార్ గార్డెన్ లో ఒక భాగం. చుట్టూ ఒక కొలను,పార్క్, లైబ్రరీ ఉంటాయ్. ఈ ప్రదేశం కపుర్తాల పాలకుని స్మారకం. మార్బుల్ నిర్మాణం పై ఖరాక్ సింగ్, జగత్ జిత్ సింగ్, పరం జిత్ సింగ్ ల సమాధులు వుంటాయి. ఈ సమాధులు రాచ కుటుంబ ధనిక స్థాయి లో ఎంతో వైభవంగా నిర్మించారు. ఈ గార్డెన్ లో ప్రతి ఏటా బసంత్ పంచమి మేలా జరుగుతుంది. అనేక మంది టూరిస్ట్ లు కపుర్తలకు ఈ సమయం లో వచ్చి ఆనందిస్తారు. ఇక్కడే ప్రసిద్ధ ‘బరాదారి’ అనే ప్రదేశం కలదు. ఇక్కడ మహారాజ రంజిత్ సింగ్ మరియు మహారాజ ఫతే సింగ్ లు మొదట సమావేశం అయ్యారు.