తమిళనాడు లో ని శివనగై జిల్లాల్లో భాగమైన కరైకుడి టౌన్ లో నెలకొని ఉన్న ఆలయం 108 పిలయర్ కోవిల్. శివపార్వతుల పుత్రుడు అయిన వినాయకుడికి ఈ ఆలయం అంకితమివ్వబడినది.
108 వినాయక మూర్తులు లేక విగ్రహాలు కలిగి ఉండడం వల్ల ఈ దేశ వ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. ఈ విశిష్టత ని చూసేందుకు ఎంతో మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. విఘ్నాలను తొలగించే దైవం గా వినాయకుడు ప్రసిద్ది చెందడం వల్ల స్థానిక ప్రజల లో ని ఈ ఆలయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. అందువల్ల, ఏదైనా కొత్త పని ని ప్రారంభించే ముందు భక్తులు ఈ ఆలయానికి వచ్చి వినాయకుడిని పూజించి ఆ తరువాత పని ప్రారంభిస్తారు. ఈ విధం గా చేస్తే పనులు సజావుగా ఎటువంటి అడ్డంకులూ లేకుండా పూర్తవుతాయని అంటారు. వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన లడ్డూ లేదా మోదక్ ని నైవేద్యంగా అందిస్తారు.