ప్రాన్మలై సేఇక్ ఒలియుల్ల దర్గా ముస్లింల మత ప్రాధాన్యత కలిగి ఉన్నది. ఇది కరైకుడి పట్టణం నుండి 40 కి. మీ. దూరంలో ఉన్నది.మతంతో సంబధం లేకుండా, చాలామంది పర్యాటకులు ప్రతి సంవత్సరం ఇక్కడికి వొస్తుంటారు ఎందుకంటే ఇక్కడకు వొచ్చి పూజ మరియు ప్రార్థనలు జరుపుతే, వారివారి కోరికలు ఫలిస్తాయని నమ్ముతారు. చాల మంది ప్రజలు, వారివారి కోరికలు తీరినతరువాత కూడా ఇక్కడికి వొచ్చి వెళుతుంటారు.
ఈ దర్గా మత సంబంధం లేకుండా అందరికి తెరిచి ఉంటుంది మరియు కరైకుడి ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రాంతాలవాళ్ళు ప్రతి రోజు పెద్ద సంఖ్యలో సందర్శిస్తుంటారు. ఇక్కడి స్థానికులు ఈ దర్గాలో గట్టిగా ప్రార్థనలు జరుపుతే, వారివారి కోరికలు, పిల్లలు, పెళ్లి, ఉద్యోగం లేదా జీవితంలోని అన్ని దోషాలు తొలగిపోవటం లాంటివి ఫలిస్తాయని నమ్ముతారు. అనేక రకాల వ్యాధులతో బాధపడేవారు ఇక్కడికి వొచ్చి స్వస్థత కోసం ప్రార్థనలు జరుపుతుంటారు. ఈ దర్గాకు వొచ్చి ప్రార్థనలు చేసిన తరువాత, వారికి అదృష్టం కలిసి రావటం, మంచి ఆరోగ్యం పొందటం వంటివి చాలా సంఘటనలు ఇక్కడి ప్రజలు చెపుతారు.