మదురై ని కరైకుడి టౌన్ తో అనుసంధానించే రోడ్డులో వివరాన్ కోవిల్ ని గమనించవచ్చు. కరైకుడి నుండి 10 కిలోమీటర్ల దూరం లో ఈ ఆలయం ఉంది. స్థానిక బస్సులు అలాగే ప్రైవేటు టాక్సీల ద్వారా ఈ కోవెల కి చేరుకోవచ్చు.
మహా శివుని రూపాలలో ఒకటైన భైరవ రూపానికి ఈ ఆలయం అంకితమివ్వబడింది. ప్రతి రోజు, ఏంతో మంది భక్తులు భైరవ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకునేందుకు అలాగే నైవేద్యాలు అందించేందుకు ఇక్కడికి విచ్చేస్తారు. ఈ ఆలయం వెలుపల ఉన్న సరస్సులో మునిగిన తరువాత భైరవ స్వామికి ప్రార్ధనలు చెయ్యాలి అంటారు.
ఈ ఆలయం శ్రీ రాముడి తో కూడా ముడి పది ఉందని పురాణం గాధలు చెబుతున్నాయి. ఈ ప్రాంతం లోనే శ్రీ రాముడికి తన భార్య సీతాదేవి లంకలో క్షేమం గా ఉందని హనుమంతుని ద్వారా తెలుస్తుంది. సీతా దేవి క్షేమ సమాచారం వినగానే రాముడు సంతోషించి హనుమంతుడికి కృతఙ్ఞతలు తెలియచేసాడు.