భీమకుండ్, కరంజియా నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సహజ నీటి రిజర్వాయర్. ఈ ప్రదేశం విస్తృతమైన సహజ అంద౦తో ఉండి, ఇక్కడ నీటి టాంక్ చాలా పవిత్రంగా భావించబడుతుంది. పురాణాల ప్రకారం, పాండవులు ద్రౌపదితో కలిసి ఈ అడవిలో సంచరిస్తున్నపుడు పాండవులలో రెండవ వాడిన భీముడు ఇక్కడ స్నానం చేసాడు అని నానుడి. ఇప్పటికీ ఈ ప్రదేశం ఒక పవిత్ర స్థలంగా భావించబడుతుంది, ఇక్కడ జనవరి మాసంలో జరిగే ‘మకర సంక్రాంతి’ పండుగ సమయంలో అనేక మంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ పవిత్ర నదిలో స్నానం చేస్తారు.
ఈ సమయంలో ‘మకర మేళా’ అనే ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. ఈ వాటర్ టాంక్ కు సమీపంలో కుందేశ్వర్ అనే శివాలయం ఉంది. స్థానిక గిరిజనుల చే సనర్శించి, పూజించబడే మా రంగబురు సమీపంలో ఉన్న మరో ఆలయం. అద్భుతమైన అందంతో ఉన్న ఈ ప్రదేశం విహారానికి సరైన ఎంపిక.