సిటీ ప్యాలెస్ ను 14వ శతాబ్దంలో రాజ కుటుంబీకులు నిర్మించారు. శిల్పకళకు, పెయింటింగ్ లకు ఇది ప్రసిద్ధి చెందింది. దర్బార్ హాలులో 600 సంవత్సరాల క్రిందటి పురాతన చిత్రాలను సైతం ప్రదర్శిస్తారు.
1938 సంవత్సరం వరకు ఈ భవనం రాచ కుటుంబీకులకు నివాసం. భన్వర్ విలాస్ భవనం కట్టిన తర్వాత రాజ కుటుంబీకులు సిటీ పేలస్ నుండి అక్కడకు మారారు. అసలు భవనాన్ని 14వ శతాబ్దంలోనే నిర్మించినప్పటికి, ఆధునిక హంగులన్ని సుమారు 18వ శతాబ్దంలోనే చేపట్టారు.