మదన్ మోహన్ జీ దేవాలయం కరౌలి కోటలో కలదు. దీనిని మహారాజా గోపాల్ సింగ్ నిర్మించారు. మదన్ మోహన్ జీ ని క్రిష్ణుడి అవతారంగా భావిస్తారు. ఇక్కడ రాధా క్రిష్ణుల విగ్రహాలు సుమారు రెండు మరియు మూడు అడుగుల ఎత్తు కలిగి ఉంటాయి. వీటిని అజ్మీర్ లోని ఒక దేవాలయంనుండి తన విజయానికి ఫలితంగా రాజు తెచ్చి దేవాలయంలో పెట్టి నిర్మించాడని చెపుతారు.
దేవాలయం మధ్య యుగంనాటి శిల్ప శైలిలో కరౌలి రాతితో నిర్మించారు. గర్భగ్రిహంలో అనేక చెక్కడాలు చూడవచ్చు. రాధా క్రిష్ణులకు సంబంధించిన అనేక పండుగ వేడుకలు ఇక్కడ చేస్తారు. జన్మాష్టమి, రాధా అష్టమి, గోపాష్టమి, హిందోళా వంటి వేడుకలలో పర్యాటకులు పాల్గొంటారు. స్ధానికులకు, పర్యాటకులకు ప్రతి అమవాస్య కు ఒక జాతర కూడా జరుపుతారు. కేలాదేవి వైల్డ్ లైఫ్ శాంక్చురీ