కొండేశ్వర్ దేవాలయంలో శివ భగవానుడి విగ్రహం ఉంటుంది. ఈ దేవాలయ ప్రాంగణంలోనే మరి కొన్ని చిన్న దేవాలయాలు కూడా కలవు. ఈ దేవాలయం ప్రసిద్ధి గాంచిన హేమందపతి శిల్ప శైలి లో నిర్మించారు. ఈ దేవాలయం చాలామంది భక్తులను, పర్యాటకులను ప్రత్యేకించి మహా శివరాత్రి వంటి సందర్భాలలో అధికంగా ఆకర్షిస్తుంది. ఈ ప్రదేశం రాతి మయం కావటం చేత, కాలు జారే ప్రమాదాల కారణంగా వర్షాకాలంలో పర్యటనకు సూచించదగినది కాదు.