కర్కల సందర్శించేటప్పుడు ప్రయాణీకులు అత్యంత ప్రసిద్ది పొందిన జైన దేవాలయాలు ఉన్న మూడబిద్రిని కూడా దర్శించవచ్చు. గట్టి గ్రానైట్ రాతిని ఉపయోగించి నిర్మించిన 1000 స్తంభాలు కలిగిన చంద్రనాథ ఆలయం మూడబిద్రి లోని ప్రధాన ఆకర్షణ, చంద్రనాథ ఆలయం చేరిన తరువాత భక్తులు 1000 స్తంభాలపై సిన్గారించబడిన క్లిష్టమైన శిల్పాకృతుల్ని గమనిస్తారు.
జైన కాశి గా పిలువబడే మూడబిద్రి లో10 వ శతాబ్దపు జైన ఆలయం ఉంది, ఇక్కడ గౌరీ ఆలయం (9 వ శతాబ్దం), కాంతవర ఆలయం (7 వ శతాబ్దం) లాంటి కొన్ని హిందూ యాత్రాస్థలాలు కూడా ఉన్నాయి. ధవళ గ్రంథాలు కలిగిన గురు బసది మూడబిద్రిలో మరో ప్రసిద్ధ ఆకర్షణ, కొనజే కళ్ళు గా పిలువబడే పెద్ద గ్రానైట్ ఏకశిలా విగ్రహాలకు పేరు గాంచిన శ్రీ చారుకీర్తి స్వామీజీ మఠాన్ని కూడా యాత్రికులు చూడవచ్చు.
అమ్మన్ వర బసది, త్రిభువన తిలక చూడమణి బసది, లేప్పద బసది మొదలైనవి మూడబిద్రిలో సందర్శించదగ్గ ఇతర స్థలాలు.