ఇంగ్లీష్ పురుషులు ఆసక్తిగల గోల్ఫ్ క్రీడాకారులు కావడంతో గోల్ఫ్ క్రీడ బ్రిటిష్ పాలన సమయంలో భారతదేశం వచ్చింది. వారు బ్రిటన్ కు వెలుపల మొట్టమొదటిసారిగా భారత దేశంలో కలకత్తాలో మొదటి గోల్ఫ్ కోర్సు ఏర్పాటు చేసారు. దీనిని రాయల్ కలకత్తా గోల్ఫ్ కోర్సు అని పిలుస్తారు. ఇది ఖచ్చితంగా దేశంలోని పురాతన గోల్ఫ్ కోర్సు గా ఉంది. ఆ తరువాత గోల్ఫ్ కోర్సులను బాంబే, బెంగుళూర్, షిల్లాంగ్, ఢిల్లీ మరియు అనేక పెద్ద నగరాలలో నిర్మించారు.
కాలం గడిచే కొలది ఆటకు ప్రజాదరణ పెరిగింది. అంతేకాక చిన్న నగరాల్లో కూడా గోల్ఫ్ కోర్సులు ఏర్పాటు చేయటం ప్రారంభించారు. వారు సరస్సులు, టీ ఎస్టేట్లు అడవులు, ఎడారులు మరియు బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించిన శిబిరాల చుట్టూ ఏర్పాటు చేశారు.
కర్నాల్ యొక్క నైసర్గిక స్వరూపం గోల్ఫ్ కోర్సులు ఏర్పాటు చేసేందుకు అనువైనది. దీని కారణంగా హర్యానా ప్రభుత్వం ఒయాసిస్ కాంప్లెక్స్ పశ్చిమ యమునా కాలువ ఒడ్డున ఒక గోల్ఫ్ కోర్సు ఏర్పాటు చేశారు. గోల్ఫ్ కోర్సు గ్రాండ్ ట్రంక్ రోడ్ నేషనల్ హైవే No.1 రెండు వైపులా ఉండేలా రూపొందించబడింది. క్రీడాకారులు గేమ్ కొనసాగించడానికి ఒక భూగర్భ మార్గం గుండా వెళ్ళాలి.
కర్నాల్ గోల్ఫ్ కోర్సు కర్ణ లేక్ మరియు ఒయాసిస్ కాంప్లెక్స్ దగ్గరగా సుందరమైన పరిసరాలు నడుమ ఉన్నది. కర్నాల్ నగరం దేశంలోనే గొల్ఫింగ్ కు గమ్యస్థానంగా ఉన్నది.