కరువుర్ లోని మరియమ్మన్ ఆలయం ఈ ప్రాంత ప్రధాన ఆలయాలలో ఒకటి. ఇది రాష్ట్రంలోని అమ్మవారి ఆలయాలలో అతిపెద్దది. మే నెలలో నిర్వహించే ఈ ఆలయ వార్షిక పండుగ ఈ ఆలయానికి అత్యంత శుభప్రదమైన రోజు. ఆరోజు ‘కుంబం’ ఆలయం నుండి బైటికి తీసుకువచ్చి అమరావతి నదికి తీసుకువెళతారు. ఈ సందర్భంగా పెద్ద ఊరేగింపు జరుగుతుంది. కుంబం అపుడు నీటిలో మునిగిపోతుంది. ప్రతి ఏటా ఈ సమయంలో, పట్టణంలోని ప్రతిఒక్కరూ ఈ పండుగను జరుపుకుంటారు.