1986 సంవత్సరంలో కాళీ నదిపై కట్టిన బ్రిడ్జి కార్వార్ పట్టణానికి వెలుపల జాతీయ రహదారి 17 పై కలదు. ఇది నేరుగా కర్నాటకను గోవాతో కలుపుతుంది. ఇది రాష్ట్రానికి గర్వకారణమైన నిర్మాణం. ఇక్కడినుండి కార్వార్ బీచ్ అందాలు దర్శించవచ్చు. మరియు సదాశివగఢ్ కోట, పర్వతాలు, సూర్యోదయ, సూర్యాస్తమయాలు, నది, సముద్రం, దీవులు అన్నీ చూడవచ్చు. బ్రిడ్జి పైనుండి కాళీ నది అరేబియా సముద్రంలో కలిసే ప్రదేశం కూడా చూడవచ్చు.