షెజ్జేశ్వర్ దేవాలయాన్ని సిద్దేశ్వర్ దేవాలయం అని కూడా అంటారు. ఇది కార్వార్ పట్టణానికి 4 కి.మీ.ల దూరంలో కలదు. స్ధానిక నమ్మకాల మేరకు ఈ పుణ్య క్షేత్రం గోకర్ణానికి సంబంధించిన అయిదు క్షేత్రాలలో కలదు. రావణుడు శివుని ఆత్మలింగాన్ని తీసుకుపోయే సమయంలో ఒక ముక్క ఇక్కడ పడిందని చెపుతారు. దేశంలోని నలుమూలలనుండి మహా శివరాత్రి సమయంలో భక్తులు ఇక్కడకు వస్తారు.