కసౌలి టవున్ లోని బస్సు స్టాండ్ నుండి 4 కి. మీ.ల దూరం లో అత్యధిక ఎత్తు లో మంకీ పాయింట్ కలదు. ఈ ప్రదేశం నుండి సట్లేజ్ రివర్, హన్దిగర్ మరియు మంచుతో నిండిన హిమాలయ దిగువ ప్రాంత చూర్ చాంద్ ని శిఖరం వంటివి చక్కగా చూడవచ్చు.
శిఖరం పై కల టెంపుల్ లో హనుమంతుడి విగ్రహం వుంటూ అనేకమంది పర్యాటకులను ఈ ప్రదేశానికి ఆకర్షిస్తుంది. ఈ దైవం పేరుతో దీనిని మంకీ పాయింట్ అన్నారు. హిందూ పురాణాల మేరకు హనుమంతుడు తాను ఔషధాలతో కూడిన సంజీవని పర్వతాన్ని మోసుకు వస్తూ ఈ పర్వతం పై కాలు మోపాడు. ఈ కొండ ఆకారం ఆ దైవం పాదం ఆకారం లో వుంటుంది.
ఈ మంకీ పాయింట్ ప్రదేశం అంతా ఇండియన్ ఎయిర్ ఫోర్సు అధీనం లో వుంటుంది. టూరిస్టులు అక్కడి అధికారుల అనుమతులు తీసుకొని సందర్సించాలి. కెమెరాలు అనుమతించబడవు. మాల్ రోడ్ నుండి సుమారు రెండు గంటలు నడక వుంటుంది. లేదా కారు లో వెళ్ళాలి.