ఆశా పురాని మందిర్ ను ప్రాచీన్ మందిర్ అని కూడా అంటారు. ఇది కథువా సిటీ మధ్య భాగంలో కలదు. దీనిని 1949లో ఒక మాజీ మంత్రి శ్రీ భగత్ చజ్జు రాం నిర్మించారు. ఈ టెంపుల్ లో మాత దుర్గా దేవి కలదు. మందిర్ భవనం 30 అడుగుల ఎత్తు వుండి, మాత విగ్రహం 10 అడుగుల ఎత్తున భవనం పై వుంటుంది.
విష్ణు మూర్తి తన సుదర్శన చక్రంతో మాత దుర్గ అస్తికలను అక్కడ పడవేసిన ఆ ప్రదేశంలో ఈ ఆశా పురాని టెంపుల్ నిర్మించారని చెపుతారు. టూరిస్టులు ప్రతి సంవత్సరం అధిక సంఖ్య లో వచ్చి ఆమె దీవనలు అందుకుంటారు.