హీరా నగర్ కథువా జిల్లాలో ఒక చిన్న పట్టణం. దీనిని జమ్మూ కాశ్మీర్ చివరి పాలకుడు రాజా హరి సింగ్ స్థాపించారు. 1834 నుండి 1844 వరకుగల పంజాబ్ పాలకుడు రాజా రంజిత్ సింగ్ ఆయనను 'జాగిర్ ఆఫ్ జశ్రోట' అని బిరుదు తో సత్కరించినపుడు, రాజా హరి సింగ్ దీనిని స్థాపించారు.
రాజ హరి సింగ్ జస్మేర్గర్ కోటను కూడా పునరుద్ధరించారు. ఈ కోట తార్నః మరియు బీన్ సరస్సుల మధ్య కలదు. ఈ కోటలో గతంలో కొన్ని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు ఉండేవి. అవి 1947 తర్వాత బదిలీ చేయబడ్డాయి.