భటోకుచి థాన్, అస్సాంలోని లఖింపూర్ జిల్లాలో ధోల్పూర్, నారాయణపూర్ దగ్గరలోని కథాని గ్రామంలో ఉన్న ఒక చిన్న ఆలయం. ఈ ఆలయాన్ని కేశబ్సరన్ భటౌకుచియ అటా నిర్మించడం వలన దీనిని భటౌకుచియా థాన్ అంటారు. ఖటగురుచరిత్ర (పురాతన గ్రంథం) ననుసరించి ఆయన 1605 లో పుట్టి 1665 లో మరణించాడు. ఈ ఆలయం అస్సాం నలుమూలల నుండి భగవంతుని ప్రార్ధించడానికి వచ్చే భక్తులను భారీ సంఖ్యలో ఆకర్షిస్తుంది. ఇది దేశంలోని ఇతర ప్రాంతాల నుండే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధ కాజీరంగా పర్యటనకు వచ్చే ప్రజలను కూడా ఆకర్షిస్తుంది.
టీ తోటలకు, అడవికి మధ్యలో ఉండటం వలన ఈ ఆలయం నిజమైన అస్సాంను చవి చూడటానికి ఒక ఉత్తమమైన ప్రాంతంగా మారింది. ఈ ఆలయ వాస్తు శైలి అస్సాం లో అహోం వంశ కాలంలోని ప్రజల నైపుణ్యానికి, పనితనానికి ప్రతీకగా నిలుస్తుంది.