దియోపర్వత శిధిలాలు, కాజీరంగా జాతీయ పార్కుకు దగ్గరలో గోలాఘాట్ జిల్లాలో నుమాలిఘర్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. దియోపహర్ (రెండు కొండలు) గా కూడా పిలిచే దియోపర్వత శిధిలాలు, కొండ పై ఉన్న పురావస్తు శిధిలాలకు ప్రసిద్ధి చెందాయి.
చుట్టూ విరిగిన శిల్పాలు పడి ఉన్న ఒక పురాతన ఆలయం కొండ పైన ఉంది. ఈ విరిగిన శిల్పాలు పురాతన ఆలయం ఎలా ఉండేదో అనే విషయాన్ని తెలియచేస్తాయి. దియోపహర్ ను ప్రత్యేకంగా ఎండగా ఉన్న ఒక రోజున ఎక్కడం బాగా అలసటను కల్గిస్తుంది. కాని ఒకసారి పైకి ఎక్కిన తర్వాత దృశ్యం మతిని పోగొడ్తుంది. పర్యాటకులు నుమాలిఘర్ టీ తోటలను, దగ్గరలోని కబి ఆంగ్లాంగ్ కొండలను కూడా తిలకించవచ్చు. నుమాలిఘర్, నుమాలిఘర్ నూనె శుద్ధి కర్మాగారానికి ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది.
నుమాలిఘర్ లోని దియోపర్వత శిధిలాలను చేరడానికి కాజీరంగా జాతీయపార్కు నుండి టాక్సీలను సులువుగా బుక్ చేసుకొనవచ్చు. గోలాఘాట్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను పర్యాటకులు కలుపుకొని దగ్గరలోని ఆకర్షణలకు ఒక రోజు పర్యటనగా వెళ్ళవచ్చు.