ఈ ప్రాంతంలోని భాగంలో ఉన్న పెటువ-గోసాని థాన్ ఒక పురాతన ఆలయం. స్థానికులు కాళీ మాతను పూజిస్తారు. ఈ దేవత పూజించబడే అతి పురాతన ప్రదేశాలలో ఇది ఒకటి. స్థానికులు కేసాయిఖైతిగా కాళీ మాతను పూజిస్తారు.
లఖింపూర్ ప్రాంత౦ పై బ్రిటీషు వారి దండయాత్రకు సంబంధించి, ఈ ఆలయాన్ని వారు ఎలా కనుగొన్నారో తెలిపే ఒక ఆసక్తికరమైన కథ ఉంది. లఖింపూర్ ప్రాంతాన్ని తమ అధీనంలోనికి తెచ్చుకోవడానికి బ్రిటీష్ వారికి కొంత సమయం పట్టింది. వారు తమ పాలనను ఈ ప్రాంతంలో స్థాపించే సమయంలో ఈ ఆలయాన్ని కనుగొన్నారు. ప్రస్తుతం అరుణాచలప్రదేశ్ లో నివసించే దఫాల ప్రజలు పురాతన కాలంలో తీర్థయాత్రకు పెటువ-గోసానికి వచ్చేవారని విశ్వసిస్తారు.
ఈ రోజున కూడా పెటువ-గోసాని థాన్ కాళీ మాత పూజించబడే ప్రసిద్ధ ఆలయం. ప్రతి ఏటా, స్థానికులు ఈ ఆలయంలో దుర్గాపూజ చేస్తారు. ఈ ఆలయం కాజీరంగా జాతీయ పార్కు నుండి ఏమంత దూరంలో లేదు.