కియోంఝర్, ఒరిస్సాలోని ఉత్తర సరిహద్దు ప్రాంతం పై ఉన్న అందమైన ప్రదేశం. ఇది రాష్ట్రంలోని అతిపెద్ద జిల్లాలలో ఒకటి, ఇది మునిసిపాలిటీ కూడా. ఈ జిల్లా ఉత్తరం వైపు ఝార్ఖండ్, దక్షిణం, పడమర, తూర్పున జైపూర్, దెంకనల్, మయూర్భంజ్ రాష్ట్రాలతో చుట్టబడి ఉంది. ఇక్కడ వైతరణి నది ఉద్భవించిన చోటు నుండి ప్రసిద్ధ కియోంఝర్ పీఠభూమి ఉంది.
కియోంఝర్ పర్యాటకం ఏడాది పొడవునా చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ ప్రదేశంలో పుష్కలంగా ఫల, పుష్ప జాతులు, ఖనిజ నిక్షేపాలు వున్నాయి. ఈ ప్రదేశంలో అందమైన జలపాతాలు కూడా వున్నాయి. ఇన్ని వైవిధ్యభరితమైన సహజ వనరులున్న జిల్లా రాష్ట్రంలో ఇదొక్కటే. ఈ జిల్లాలో మూడో వంతుకు పైగా దట్టమైన అడవులు వున్నాయి, జిల్లాలో చాలా చోట్ల మాంగనీసు ఖనిజం దొరుకుతుంది. జిల్లాలోని రెబానా, కలపతా బ్లాకుల్లో పులులు వుంటాయి.
కియోంఝర్ పర్యాటకం యాత్రికులకు చాలా ఆకర్షణలు అందిస్తుంది. ఇక్కడి కందదార్ జలపాతాలు, సంఘగర జలపాతాలు, బడా ఘాగర జలపాతాలు ఇక్కడ పర్యాటకులకు ఆసక్తి కలిగించేవి. ఘటగావ్ లో వున్న దేవాలయం మరో ప్రధాన ఆకర్షణ. ఈ ప్రసిద్ధ దేవాలయాన్ని ఏడాది పొడవునా పర్యాటకులు సందర్శిస్తారు. గోనసిక, గుండిచఘై, భీమ్ కుండ్, ముర్గమహదేవ్ దేవాలయం, జిల్లా మ్యూజియం కూడా ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు. అతి పురాతన శివాలయం వున్న చక్రతీర్థ కూడా ప్రసిద్ధ పర్యాటక కేంద్రం.
సీతా బింజ్, రాజానగర్ కూడా కియో౦ఝర్ పర్యాటకంలో ప్రసిద్ధ చారిత్రిక ఆకర్షణ. రాజానగర్ లో కియో౦ఝర్ పాత రాజుకు చెందిన ప్రాచీన రాజభవనం శిధిలాలు వున్నాయి. ఇక్కడ దాదిబామన్ యూదుల దేవాలయం, రఘునాథ్ యూదుల మాత దేవాలయం కూడా వున్నాయి. ప్రతి ఏటా శీతాకాలంలో చాలా జాతులకు చెందిన వలస పక్షులు రాజానగర్ లోని చదేయి కుదూర్ కు చేరుకుంటాయి. ఒకప్పటి ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం దేవగావ్ కుశాలేశ్వర్ ఇక్కడ వున్న కుశాలేశ్వర్ దేవాలయానికి ప్రసిద్ది చెందింది.
కియో౦ఝర్ : ప్రాచీన వైభవ పునరుద్ధరణ
జువాంగ్స్, భుయాన్స్ అనే రెండు జాతులు ఈ ప్రాంతం ప్రాచీన వైభవ పునరుద్ధరణ లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. చాలా ప్రాచీనమైన ఈ రెండు జాతులు ఇక్కడి అసలైన నివాసులు.
కియోంఝర్ ను సందర్శించడానికి ఉత్తమ సమయం
వాతావరణం మధ్యస్తంగా వుండే నవంబర్ లో చాలా మంది కియోంఝర్ ను సందర్శిస్తారు.
కియోంఝర్ ఎలా చేరుకోవాలి ?
కియోంఝర్ ను నవంబర్ లో చూడవచ్చు. ఈ ప్రాంతాన్ని చూడడానికి ఇది ఉత్తమ సమయం. ఈ ప్రాంతానికి వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా తేలిగ్గా చేరుకోవచ్చు. భువనేశ్వర్ లోని బిజూ పట్నాయక్ విమానాశ్రయం ఇక్కడికి సమీపంలో వుంది, జె కే రోడ్ రైల్వే స్టేషన్ ద్వారా కియోంఝర్ చేరుకోవచ్చు.