గోనసిక ఒరిస్సా కియోంఝర్ జిల్లలో ఉన్న ప్రసిద్ధ పర్వత౦. ఈ ప్రదేశంలో వైతరణి నది ఉద్భవించిందని భావిస్తారు, దీనికి గొప్ప చారిత్రిక విలువ ఉంది. కియోంఝర్ జిల్లా ప్రధానకేంద్రం నుండి కేవలం 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి జిల్లా ప్రధానకేంద్రం నుండి కారులో అరగంటలో చేరుకోవచ్చు. ఇక్కడ బ్రహ్మేశ్వర్ మహాదేవ ఆలయం ఉండడం వల్ల ఈ ప్రాంతం ప్రసిద్ది చెందింది.
వైతరణి నది పుట్టిన ప్రదేశం నుండి కొంతదూరం ప్రవహించిన తరువాత భూగార్భంలోకి ప్రవహిస్తుంది. ఈ నది కొద్ది దూరంలోని భూగర్భాన్ని ఆక్రమించిన తరువాత మళ్ళీ కనిపిస్తుంది, ఈ మొత్తం ప్రయాణం ఆవు ముక్కు రంధ్రాలను పోలిఉంటుంది. ఈ స్థలం వారాంతపు సెలవలలో స్నేహితులు, కుటుంబాలతో గడపడానికి ఖచ్చిత౦గా ఉత్తమమైనది. అంతేకాకుండా, ప్రభుత్వం వారు నిర్వహించే ప్రత్యెక టూర్లలో ఉండే గైడ్లు కూడా పర్యాటకులందరికీ ఆ ప్రాంత౦ గురించి అన్ని వివరాలు అందిస్తారు.