కీలాంగ్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో వున్న గురు ఘంటాల్ లేదా గందోలా విహారం ఇక్కడి ప్రసిద్ధ ధార్మిక కేంద్రం. లాహౌల్ జిల్లాలో అతి పురాతనమైనదిగా పేర్కొనబడే ఈ విహారం 8 వ శతాబ్దంలో పద్మసంభవుడు స్థాపించాడు. చెక్కతో నిర్మించిన శిల్పాలు ఈ విహారంలో ప్రదాన ఆకర్షణలు. ఈ విహారంలో ప్రత్యెక నిర్మాణ శైలిలో నిర్మించిన పిరమిడ్ ఆకారపు పైకప్పులు, సంక్లిష్టమైన చెక్కుళ్ళు వున్నాయి. ఈ విహారం శిధిలావస్థ లో ఉండడంతో వీటిలో చాల విగ్రహాలను తుప్చిల్లింగ్ గ్రామంలోని మరో విహారానికి మార్చారు.
చంద్రా, భాగా నదీ తీరాల వెంట వున్న ఈ విహారంలో బుద్ధుడి కారుణ్యానికి ప్రతీక అయిన అవలోకితెశ్వరుడనే బోధిసత్వుడి పాలరాతి విగ్రహానికి చెందిన పాడైన శిరోభాగం వుంది. ఈ విహారం చరిత్ర 2 వ శతాబ్దంలో నాగార్జునుడి కాలం నాటిది. ఈ విహారంలోని అంతరాలయంలో నల్ల రాతితో చెక్కిన కాళీ దేవి విగ్రహం వుంది – ఈ విహారం పూర్వం గుడిగా ఉండేదని సూచిస్తుంది.