హిమాచల్ ప్రదేశ్ లోని కీలాంగ్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో వున్న తాయుల్ విహారం లేదా గోమపా ఒక ప్రధాన ధార్మిక కేంద్రం. సముద్ర మట్టానికి 3900 మీటర్ల ఎత్తున వున్న సతినగరి అనే గ్రామంలో వున్న ఈ విహారం కీలాంగ్ లోని పురాతన విహారాల్లో ఒకటి. దీన్ని 17 వ శతాబ్దం లో ఖాం ప్రాంతానికి చెందిన దోగ్పా లామా, సేర్బాంగ్ రించేన్ లు స్థాపించారు.
టిబెట్ భాష లో తా-యుల్ అంటే ‘ఎంచుకున్న ప్రదేశం’ అని అర్ధం – ఇక్కడ గురు పద్మసంభవుడి 12 అడుగుల విగ్రహంతో పాటు, అతని సృష్టి అయిన సింఘముఖ, వజ్రవాహిత్ ల విగ్రహాలు కూడా వున్నాయి. ప్రత్యెక బౌద్ధ పర్వదిన సందర్భాల్లో తనంత తానుగా తిరిగే పది కోట్ల మణి చక్రం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. తాయుల్ లామాల ప్రకారం ఈ చక్రం చివరిసారిగా 1986 లో స్వయంగా తిరిగింది.