బీజమండల్ ఆలయం ఖజురహో లోని విదిష లో ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక తెల్లరాయి ఉండడం వల్ల వేరుగా కనిపిస్తుంది. ఈ ఆలయ అద్భుత నిర్మాణం ఇండోనేసియన్ల లేదా ఆగ్నేయ ఆసియా శైలిని ప్రదర్శిస్తుంది. నిజానికి ఇప్పుడు ఈ ఆలయం శిధిలావస్థలో ఉంది. ప్రతిరోజూ రాత్రి ఈ ఆలయంలో పవిత్రమైన దీపాన్ని వెలిగించడం ఇక్కడి సంప్రదాయం. ఈ ఆలయానికి సమీపంలో నివశించే ప్రజలకు ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజూ రాత్రి పవిత్రమైన నూనె దీపాన్ని వెలిగించడం అలవాటు. ఇప్పటికీ ఈ అలవాటు కొనసాగుతుంది. ఈ ఆలయం నిజానికి హిందూ దేవతలైన శివుడు, పార్వతిని గౌరవించడం, పూజించడానికి నిర్మించారు. కానీ బాగా అలంకరించబడిన ఈ ఆలయ బైటి గోడల మిగిలిన నిర్మాణాన్ని చూడవచ్చు. ఈ గోడలపై వివిధ జంతువుల చిత్రాలు చెక్కబడి ఉన్నాయి. ఈ ఆలయం లోపల అనేక అద్భుతమైన మానవ రూపాల చిత్రాలు చెక్కబడి ఉన్నాయి.