జమలాపురం ఆలయం ఖమ్మ౦ ప్రధాన నగరం నుండి 124 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే, ఈ ఆలయాన్ని ఖమ్మం చిన్న తిరుపతి అంటారు.
అనేక శతాబ్దాల క్రితం విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. హిందువులకు ఎంతో ప్రధానమైన ఆలయం కనీసం 1000 సంవత్సరాల నాటిదని భావిస్తున్నారు. ఈ ఆలయాన్ని అనేకమంది భక్తులు సందర్శిస్తారు. ఈ ఆలయం ముఖ్యంగా శనివారం రోజు పూజారులచే నిర్వహించబడే పూజలు, ప్రార్ధనలతో సందడిగా ఉంటుంది. ఈ ఆలయంలో ప్రార్ధన చేస్తే వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.
ఈ ఆలయానికి అతి దగ్గరలో జాబాలి మహర్షి కి సంబంధించిన సూసి గుట్ట అనే కొండ ఉంది. ఈ మహర్షి ఇక్కడ తీవ్రంగా తపస్సు చేయడం వల్ల వెంకటేశ్వర స్వామి దర్శన మిచ్చి ఆయనను దీవించారని భావిస్తారు.