గౌరీ కుంజ్ అనే స్మారక చిహ్నం ప్రసిద్ధ గాయకుడు కిషోర్ కుమార్ గంగూలీ గౌరవార్ధం నిర్మించారు. ఈ ప్రదేశం ఈ లెజండరీ గాయకుడు అయిన కిషోర్ కుమార్ గంగోపాధ్యాయ యొక్క జన్మస్థలం కావటం వలన ఖాండ్వా తో ప్రత్యేక బంధాన్ని కలిగి ఉండెను.
దీనికి పునాది రాయి కీర్తిశేషులైన గాయకుడు కిషోర్ కుమార్ అన్నయ్య అయిన నటుడు అశోక్ కుమార్ చే చేయబడింది. స్మారక చిహ్నం కిషోర్ కుమార్ కు అంకితం చేయబడింది. ఆడిటోరియంకు పేరు తన తల్లిదండ్రులు గౌరిదెవి మరియు కున్జిలాల్ గంగోపాధ్యాయల నుండి పెట్టబడింది.
గౌరీ కుంజ్ 1998 వ సంవత్సరంలో రాజేష్ ఖన్నా ప్రారంభించారు. ఈ ప్రదేశం కళలు మరియు సాంస్కృతిక కార్యక్రమాల కొరకు ఒక ప్లాట్ఫారమ్ వలె పనిచేస్తుంది. మధ్య ప్రదేశ్ ప్రభుత్వము మరియు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ గౌరీ కుంజ్ ను నిర్వహిస్తుంది. ఇది రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నది. గౌరీ కుంజ్ పట్టణం వైపు స్టేషన్ నుండి ఐదు నిమిషాల నడక దూరంలో ఉంది.
మీరు సంగీతం మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలకు అభిమాని అయి ఉంటే మీరు తప్పనిసరిగా ఇక్కడ జరిగే కార్యక్రమాలకు హాజరు కావాలి.