ఖేడా జిల్లా లోని డకోర్ లో గోమతీ సరస్సు ఒడ్డున రన్ చోడ్ రాయ్ దేవాలయం వుంది. కోట గోడల మధ్యలో ఎనిమిది గోపురాలతో నిర్మించిన ఈ దేవాలయంలో మధ్య గోపురం 27 మీటర్ల ఎత్తుంటుంది. రన్ చోడ్ రాయ్ దేవాలయం జిల్లాలోకల్లా ఎత్తైనది, బంగారు గోపురం, తెల్లటి పట్టు పతాకం కలిగి వుంటుంది. శ్రీ కృష్ణుడి జీవిత ఘట్టాలను
ఈ దేవాలయ ప్రాంగణంలో చిత్రించారు. నల్లటి రాతిలో చెక్కిన ఇక్కడి మూల విరాట్టు బంగారు, వెండి ఆభరణాలతోను, పట్టు వస్త్రాల తోనూ చక్కగా అలంకరించి వుంటుంది. చక్కగా చెక్కిన దేవుడి చెక్క ముల్లును బరోడా గైక్వాడ్ బహుకరించాడు. రన్ చోడ్ రాయ్ దేవాలయం 1772 లో గోపాల్ జగన్నాథ్ అమెకర్ నిర్మించాడు. ఈ గుడి ఉదయం 6 నుంచి 12వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు తెరిచే వుంటుంది.