రాజస్తాన్ లోని జోద్ పూర్ జిల్లాలో జోద్పూర్ నగరానికి పశ్చిమంగా 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. 4.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఎడారి గ్రామం ఖీచన్స్. 4.5 కిలోమీటర్ల దూరంలో వున్న ఫలోదీ దీనికి సమీప పట్టణ౦. గత కొన్నేళ్ళుగా ఈ గ్రామం ప్రతి ఏడాది ఇక్కడకు వచ్చే అందమైన డేమాయిసేల్లె కొంగలకు ఆతిధ్యమిచ్చే ఒరవడిని అలవర్చుకున్నది.
అంతర్జాతీయ గుర్తింపు ఉన్న పక్షుల కేంద్రం
కొన్నేళ్ళ క్రితం స్థానిక ప్రజలు కొంత మంది మార్వాడి సమాజంలోని ఒక పక్షి ప్రేమికునితో కలసి ఈ పక్షులకు ప్రతి ఉదయం గింజలు తినిపించడం ప్రారంభించారు. ఫలితంగా భారీ సంఖ్యలో స్థానికంగా కుర్జాస్ అని పిలిచే డేమాయిసేల్లె కొంగలు ఆకర్షితమయ్యాయి. అప్పటి నుండి ఈ పక్షులకు గింజలు తినిపించే ధోరణి కొనసాగింది. ప్రస్తుతం, ఖీచన్ లో రోజుకు 5000 కిలోల గింజలు పక్షుల కోసం వినియోగిస్తున్నారు.
పక్షి ప్రేమికుల్లో బాగా ప్రసిద్ధి పొందిన ఈ గ్రామం గురించి బర్డింగ్ వరల్డ్ పత్రికలో ఖీచన్ – అందమైన డేమాయిసేల్లె కొంగల గ్రామం అనే శీర్షికన ఒక వ్యాసం ప్రచురించిన తర్వాత ఈ గ్రామం అంతర్జాతీయ గుర్తింపు పొందింది.
పర్యాటకులు, స్థానిక ప్రజలు ఇచ్చే నగదు విరాళాలతో ఖీచన్లో ఏర్పాటైన కుర్జ సంరక్షణ వికాస సంస్థ, పక్షి చుఘ ఘర్ ఈ వలస పక్షుల భద్రత, రక్షణ నిర్వహిస్తుంది. ఈ పక్షులను రక్షించే ధ్యేయంతో మార్వారీ కొంగల ఫౌండేషన్ ను కూడా నెలకొల్పారు.
ఖీచన్ ను రాజస్తాన్ ప్రభుత్వం ఒక పర్యాటక కేంద్రంగా ప్రకటించింది. కొంగలకు ఆహారం పెట్టె మార్వాడి కొంగల ఫౌండేషన్ కు మద్దతునిస్తున్న అంతర్జాతీయ కొంగల ఫౌండేషన్ డైరెక్టర్ కూడా ఈ ప్రదేశాన్నిసందర్శించారు.
ఖీచన్ చేరుకోవడం
ఈ ప్రాంతానికి వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా సులువుగా చేరవచ్చు. సమీపంలోని జోద్పూర్ సివిల్ విమానాశ్రయం 150 కిలోమీటర్ల దూరంలో ఉండగా, ఫలోది రైల్వేస్టేషన్ ఈ ప్రాంతానికి 4.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దగ్గరి స్టేషన్. ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కూడా ఉంది.
వాతావరణం ఆహ్లాదకరంగా ఉండే శీతాకాలం ఖీచన్ లో పర్యటించేందుకు ఉత్తమ సమయం.