ఖింసార్ కోట ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇది ధథార్ ఎడారి చివరి భాగంలో కలదు. దీనిని జోధ్ పూర్ పట్టణ వ్యవస్ధాపకుడు రావు జోధాజీ ఎనిమిదవ కుమారుడు రావ్ కరంసిజి నిర్మించాడు. పసుపు రంగు కల ఈ కోట సుమారు 16వ శతాబ్దంలో రాజపుటాణా శిల్పశైలిలో నిర్మించబడింది. కోట లోని లాన్ లు సుమారు 11 ఎకరాలు విస్తరించి చుట్టు పక్కల ప్రదేశాలకు మరింత అందాన్నిచ్చాయి.
ఈ కోట ప్రారంభంలో యుధ్ధాల కొరకు కట్టబడినప్పటికి 18వ శతాబ్దంలో రాజకుటుంబీకులు అక్కడ జనానాకు తమ నివాసాలు బదిలీ చేసుకొనడంతో రాచ మహిళలకు ఒక ప్రత్యేక విభాగం అందులో ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఈ కోటలో సగ భాగం నేటికి రాజ వంశ కుటుంబాలచే నివాసంగా వినియోగించబడుతోంది. మిగిలిన సగ భాగం కోటను ఒక హెరిటేజ్ హోటల్ గా మార్పు చేశారు.
భారత ప్రభుత్వం ఈ కోటకు చక్కగా నిర్వహిస్తున్నందుకుగాను నేషనల్ గ్రాండ్ హెరిటేజ్ అవార్డ్ ఫర్ ఎక్స్ లెన్స్ అవార్డును ఇచ్చింది.