రాకచ్చం-చ్చిట్కుల్ అభయారణ్యం, ఇది కిన్నౌర్ జిల్లాలో సముద్ర మట్టానికి 3200 నుండి 5496 మీ. ఎత్తున ఉన్నది. ఇది ఒక ప్రముఖ పర్యాటక స్థలం. దీని ఏరియా 3411 హెక్టార్లు ఉండి, రెకాంగ్-పో ప్రాంతంలో ఉన్న మూడు ముఖ్యమైన అభయారణ్యాలలొ ఇది ఒకటి. దీనిని వరుసగా 1962 మరియు 1974 లలో గుర్తించారు. ఈ అభయారాణ్యంలో గోరల్, చిరుత, కస్తూరి జింక, నీలిరంగు గొర్రెలు, హిమాలయాల నల్ల ఎలుగుబంటి మరియు బ్రౌన్ ఎలుగుబంటి వంటి అనేక జాతుల జంతువులు ఉన్నాయి. యాత్రికులు ఇక్కడ ఓక్స్,ఫైర్ మరియు దేవదారు వంటి అనేక రకాల చెట్లను కూడా చూడవొచ్చు.
రాకచ్చం మరియు చ్చిట్కుల్ అనే ఈ రెండు గ్రామాలు ఒకదానికొకటి 15 కి. మీ. దూరంలో ఉన్నాయి. రాకచ్చం గ్రామం 'బసప' నది ఒడ్డున ఉన్నది. ఇది ప్రకృతి సౌందర్యానికి పేరు గాంచింది, చ్చిట్కుల్ గ్రామం ప్రపంచంలో కల్లా మంచి బంగాళాదుంపల ఉత్పత్తికి పేరు గాంచింది.