చారిత్రిక ప్రాధాన్యం కలిగిన కిషన్ గర్ ఫోర్ట్ జై సల్మేర్ బల్జ్ లో ఉంది. మడ , రామ్ గర్ , తనోట్ అను పట్టణముల మధ్య ఈ కోట ఉంది. రాథోర్ రాజ వంశీకులు ఈ కోటని నిర్మించినట్టు భావించవచ్చు. శతాబ్దాల క్రితం నిర్మించబడ్డ ఈ కోట భారత దేశం యొక్క నిర్మాణ కళ ల కి ఒక ఉదాహరణ.ఈ కోట కి వ్యూహాత్మక ప్రాముఖ్యత వుంది. ఇండియా, పాకిస్తాన్ ని కలిపే రోడ్డులో ఈ కోట ఉంది. పాకిస్తాన్ సైన్యం స్థానిక గిరిజనుల సహాయంతో ఈ ఫోర్ట్ ని ఆక్రమించినప్పుడు ఈ ఫోర్ట్ వెలుగులోకి వచ్చింది. తాష్కెంట్ ఒప్పందం తర్వాత ఈ ఫోర్ట్ తిరిగి ఇండియా కి ఇవ్వబడినది.చరిత్ర మరియు పురాతత్వ శాస్త్రం గురించి ఆసక్తి కలిగిన పర్యాటకులకి కిషన్ గర్ ఫోర్ట్ ప్రధాన పర్యాటక ఆకర్షణ గా పేర్కొనవచ్చు.