రెండు దేశాల మధ్య, రెండు సంస్కృతుల మధ్య సామరస్యానికి ప్రతీకగా ఈ ఇండో పోర్చుగీసు మ్యూజియాన్ని చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యుత్తమ రేవు పట్టణముగా కొచ్చి ని తయారు చేయడానికి ప్రధాన పాత్ర వహించిన పోర్చుగీసు సంస్కృతి కి ప్రతిబింబం ఈ మ్యూజియం.
పోర్చుగీసు వర్తకులు కొచ్చి చరిత్రలో వదిలి వెళ్ళిన కళాఖండాలు, చారిత్రిక వస్తువులు, చెదిరిపోని కొన్ని పత్రాలని ఈ మ్యుజియం పొందుపరిచింది. కొచ్చి యొక్క ఆనాటి బిషప్ డా. కురీత్ర కలల ప్రతిరూపం ఈ మ్యూజియం. రెండు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక సామరస్యాన్ని ప్రతిబింబించడమే ఈ మ్యుజియం నిర్మాణానికి గల ముఖ్య కారణం.
రెండు లేదా అంత కంటే ఎక్కువైన విభిన్న సంస్కృతుల లేదా మతాల ప్రశాంతమైన సహజీవనం గురించి తర తరాలకు బోధించడమే ఈ మ్యుజియం ఒక్క ముఖ్య ఉద్దేశం. నాణ్యత కలిగిన కలపపై సున్నితంగా చెక్కబడిన శిల్పాలు ఉత్తమ హస్త కళా నైపుణ్యానికి అద్దం పడతాయి. పురాతత్వవేత్తలకి ఈ మ్యుజియం ఎంతో ఆనందం కలిగిస్తుంది