జ్యూ టౌన్ తప్పక సందర్శించవలసిన పర్యాటక ప్రదేశం. ప్రాచీన జ్యూయిష్ స్థావరాలు, ప్రత్యేక మైన నిర్మాణ శైలి వంటివి ఏంతో మంది సందర్శకులని ఆకర్షించే అంశాలు. అంతే కాదు, భారత దేశం లో మిగతా నగరాలలో ఎక్కువగా యూదులు ఇక్కడ నివసించడం వల్ల కొచ్చి నగరానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది.
700 BC లో యూదులు వ్యాపార వానిజ్యాల కోసం కొచ్చి కి వచ్చారని చరిత్ర చెబుతోంది. ఆ తరువాత, సాంస్కృతిక వస్త్రవ్యాపారం లో స్థిరపడ్డారు. అప్పటి పాలకుడు కొచ్చి లో స్థిరబడిన యూదుల కుటుంబాల కోసం ఒక ప్రాంతాన్నికేటాయించాడు. ఆ ప్రాంతమే ఇప్పుడు జ్యూయిష్ టౌన్ గా ప్రసిద్ది చెందింది.
డచ్ పాలస్, పరదేశి సినాగోగ్యు గా ప్రసిద్ది చెందినా యూదుల పురాతన ప్రార్ధనా మందిరం జ్యూ టౌన్ లో ని ప్రధాన ఆకర్షణలు. ఈ టౌన్షిప్ లో వీధులలో ని షాపులలో వివిధ రకాల సుగంధ ద్రవ్యాల వ్యాపారం సాగుతుంది. ఒకప్పటి యూదుల వైభవానికి ప్రతినిదిగా వీధులలో వలస భవనాలపై ఇప్పటికీ జ్యూయిష్ పేర్లు కనబడుతాయి. ఈ నగరంలోని షాపులలో అద్భుతమైన ఆభరణాలు, ప్రాచిన కళాఖండాలు వంటివి ఎన్నో లభిస్తాయి. షాపింగ్ చేయడానికి అనువైన ప్రదేశం అని చెప్పుకోవచ్చు.